ఎగ్జామ్ సెంటర్లు కొవిడ్ హాట్ స్పాట్ లుగా మారొచ్చు

ఎగ్జామ్ సెంటర్లు కొవిడ్ హాట్ స్పాట్ లుగా మారొచ్చు

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ-2021 పరీక్షలను రద్దు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ అన్నారు. ఈ మేరకు ఎగ్జామ్స్ ను క్యాన్సిల్ చేయాలని కోరుతూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ కు ప్రియాంక లేఖ రాశారు. దేశంలో కరోనా తిరిగి విజృంభిస్తున్నందని.. విద్యార్థుల సేఫ్టీ దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఈ సూచనలను పట్టించుకోకుండా పరీక్షలను నిర్వహిస్తే ఎగ్జాం సెంటర్లు కొవిడ్ హాట్ స్పాట్ లుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.